కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాలనీలలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం డివిజన్ పరిధిలోని మై ఫీల్ హోమ్ లో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ అసోసియేషన్ నాయకులు ప్రజలతో చర్చించారు. కాప్రా సర్కిల్ ఏ ఈ. తిరుమలయ్య, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు తదితర అధికారుల బృందంతో కలిసి కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రేటెడ్ కమ్యూనిటీలో నిర్మించిన గోడల కారణంగా వర్షం నీరు నిలిచిపోతుందని, గోడలను తొలగించి గ్రిల్స్ ఏర్పాటు చేసుకుంటే వర్షం నీరు వెళ్లేందుకు వీలుగా ఉంటుందనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మై ఫీల్ హోమ్ అసోసియేషన్ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.