నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. రఘుపతిపేట, లింగసానిపల్లి, గంఢూరు, మొకురాల, పంజుగుల ఎల్లికల్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోని తాము పండించిన పంటలను అమ్ముకొని అధిక ధరలు పొందాలని అన్నారు. వరి ధాన్యం మొదటి రకం క్వింటాలుకు 1835 రెండవ రకం 1815 రూపాయలు చొప్పున ప్రభుత్వం రైతులకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి రాములు వివిధ గ్రామాల ఎంపీపీలు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.