వరి ధాన్యం పండించిన రైతులు ఎవరు అధైర్య పడకుండాల్సిన అవసరం లేదని పండిన ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేస్తామని కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సంఘం(PACS) చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని సుద్దకల్, వేపూర్, బెక్కార, తోటపల్లి, ఎల్లికట్ట, ఎల్లికట్ట తండా,వెంకటాపురం, జీడిపల్లి గ్రామమాలలో వరి కొనుగోలు కేంద్రాలను నేడు ఆయన పరిశీలించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరె ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కెసిఆర్ ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసి రైతును లాభాల బాటలో నడిచే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ సి చైర్మన్ శ్యామ్ సుందర్ డైరెక్టర్ రాములు నాయక్ పలు గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.