నిర్మల్ జిల్లా సొన్ గ్రామ మాజీ సర్పంచ్ సాయ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన మనుమళ్లు శ్రీనివాస్ గౌడ్, శరత్ గౌడ్, ఆదివారం గ్రామంలోని 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి TRS యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా అల్లోల గౌతంరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో శ్రీనివాస్, శరత్ గౌడ్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, జడ్పిటిసి జీవన్ రెడ్డి, మండల కన్వీనర్ క్రిష్ణ ప్రసాద్, ఎంపిటిసి శ్రీనివాస్,నాయకులు గంగాధర్, జగన్, ప్రసాద్, రాజేశ్వర్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.