37.2 C
Hyderabad
April 30, 2024 12: 11 PM
Slider ఆధ్యాత్మికం

జోగులాంబ దేవాలయం సన్నిధిలో పద్మశాలి అన్నదాన సత్రం

#Jogulamba Temple

జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి కమిటీ పద్మశాలి జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ అధ్యక్షతన స్థానిక మార్కండేయ స్వామి కళ్యాణ మండపంలో  జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 5వ శక్తి పీఠం జోగులాంబ దేవాలయం సన్నిధి లో పద్మశాలి అన్నదాన సత్రం నిర్మించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి  కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు.

అలంపూర్ జోగులాంబ ఐదవ శక్తిపీఠం. అమ్మవారిని దర్శించుకోవడానికి  భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి భక్తులు జోగులాంబ అమ్మవారిని దర్శించు కోవడానికి వస్తారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి వసతి, అన్నదానం చేయడం మంచిదని జిల్లా కమిటీ నిర్ణయించింది.

ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి యువజన సంఘం, పట్టణ పద్మశాలి సేవా సంఘం, పట్టణ యువజన సంఘం వారి సహకారంతో త్వరలో పద్మశాలి అన్నదాన సత్రం ట్రస్ట్ కమిటీ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేపడతామని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి వీరన్న అన్నారు.

ఈ కార్యక్రమానికి మురళి, ఆంజనేయులు, పులిపాటి బలరాం, తిరుమల సత్యం, నీలి నాగన్న, హనుమంతు తదితర పద్మశాలి కుల బాంధవులు హాజరయ్యారు.

Related posts

ప్రతి చోటా సీసీ కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

శ్రీశైలంలో ఘనంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

నూరు శాతం జనన,మరణాల నమోదు జరిగేలా చూడాలి

Bhavani

Leave a Comment