శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిషో ర్ కుమార్, ఆర్డీఓ భవానీశంకర్ తో కలిసి నగరంలో పర్యటించారు. ఈమేరకు విజయనగరం ఎమ్మార్వో ప్రభాకర్ రావు….ఆధ్వర్యంలో ముందుగా సిరిమాను సిద్ధమవుతున్న హుకుంపేట వెళ్లారు.
అక్కడే ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటివద్ద తయారవుతున్న అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను, రథాలను పరిశీలించారు. అనంతరం ఆలయ పూజారి వెంకటరావుతో కలిసి అటు జే.సీ ఇటు ఆర్డీఓలు చర్చించారు. పనులను సకాలంలో పూర్తిచేయించాలని కోరారు.
అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను, సంబంధిత శాఖల అధికారులతో కలిసి జేసీ కిషోర్ సందర్శించారు. భక్తులకోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు.
ఆలయం సమీపంలో ఇదివరకు పాత డీఎంఅండ్ హెచ్ ఆఫీసు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమును, వీఐపీ లాంజ్ను తనిఖీ చేసి…. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఆలయ అధికారులు,నగర వన్ టౌన్,టూటౌన్ సీఐలు మురళీ,లక్ష్మణరావులు పాల్గొన్నారు.