ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా మరోసారి క్రియాశీలకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఉగ్రవాద సంస్థ మళ్ళీ జవసత్వాలు నింపుకుని నిలబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ మీడియా ప్రకారం, లష్కర్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంక్వాలో కొత్త ఉగ్రవాద శిబిరాలను సిద్ధం చేసింది.
వీటిలో వందలాది మంది ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు. ఈ పనిలో హక్కానీ నెట్వర్క్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ (ఐఎస్ఐఎస్-కె) నుంచి లష్కర్కు సహాయం కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది.