గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో అన్నవరం గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఆ గ్రామంలో గల గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
నామినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 13న జరుగునున్న గ్రామపంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్లు కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులనుండి నామినేషన్లు స్వీకరిస్తున్నారని అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటినివారణకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్-కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తహశీల్దార్ జాన్ సైదులు ఎస్ ఐ పి.హజరత్తయ్య రెవెన్యూ సిబ్బంది నామినేషన్ సిబ్బంది పాల్గొన్నారు.