ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకొంది.సమ్మెలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఉరి తాడుతో ఉరేసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతి కార్మికులు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు..