గ్రామ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆసిఫాబాద్ జిల్లా నాయకులు, పంచాయతీ కార్మికులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు మంగళవారం ఆసిఫాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ రాస్తారోకో నిర్వహించారు .. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు, గ్రామ పంచాయతి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
previous post