40.2 C
Hyderabad
April 28, 2024 16: 18 PM
Slider వరంగల్

ములుగు బిజెపి ఆధ్వర్యంలో పండిత్ దీన దయాళ్ జయంతి

#MuluguBJP

పండిత్ దీన దయాళ్  జయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  కార్యాలయంలో నేడుక ఘన నివాళి అర్పించారు. పండిత్ దీన దయాళ్ చిత్రపటానికి పూల మాలలు వేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు చింతలపూడి బాస్కర్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్బంగా చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయులు 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర నాగ్ లా చంద్రఖాన్ అనే గ్రామము లో జన్మించారు.

RSS బాధ్యతలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జి మరణతరం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని విజయపథంలో నడిపించాడు. అలాగే  ఆర్ఎస్ఎస్ వారపత్రిక పంచాజన్య దిన పత్రిక స్వదేశ్ లకు సంపాదకీయలుగా వ్యవహరించారు.

అలాగే ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవా చేయడమే సరైన జీవిత ఆధారమని హితోపాదేశం చేసాడు. దేశ సమైక్యత కోసం శ్రమించిన మహర్షి, నిరంతర మానవ బంధాలు బలపడేందుకు తపించి తాపసి ఏకాత్మతా మానవతావాదమే మనిషిని మనిషిగా తీర్చిదిద్దే నిజమైన సాధనం అని ఉద్భోధించారని తెలిపారు.

జాతీయ భావజాలాలు సిద్ధాంతాన్నీ ప్రతిపాదించి జనసంఘ్ పార్టీ ఆవిర్భావానికి కృషిచేసిన ఋషి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కోమ్మిరెడ్డి నర్సింహారెడ్డి

కార్యాలయ కార్యదర్శి చల్లురి మహేందర్, చిన్నకొండారెడ్డి బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకలకృష్ణకర్ రావు జిల్లా నాయకుడు గంగిశెట్టి రాజుకుమార్ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కోయిల కవిరాజ్

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా నాయకులు కొత్త సురేందర్ దొంతీ రెడ్డి రాజేష్ రెడ్డి ప్రశాంత్ మొదలైన వారు పాల్గొన్నారు.

Related posts

వార్డు స‌చివాల‌యం త‌నిఖీ

Sub Editor

లోన్ యాప్ లపై జాగ్రత్త

Satyam NEWS

సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఇక లేరు

Satyam NEWS

Leave a Comment