31.2 C
Hyderabad
May 2, 2024 23: 27 PM
Slider ఆదిలాబాద్

దేశానికి దిశానిర్దేశం చేసిన పండిట్ దీన్ దయాళ్

#BJPNirmal

బీజేపీ సిద్ధాంత కర్త మాననీయ పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని నేడు నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ మాట్లాడుతూ మానవత ఏకాత్మతా వాదం రచించి పార్టీ కార్యకర్తలకే కాకుండా దేశానికి దిశ దశను నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన అని అన్నారు. 

దీనదయాళ్ ఆరెస్సెస్ ప్రచారక్ గా ఉంటూ దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు జనసంఘ్ లో చేరి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఆయన కృషి చేశారని తెలిపారు.

 జనసంఘ ను ప్రారంభించి దేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ దేశభక్తి జాతీయ భావాలు పెంపొందిస్తూ ప్రజలను ముందుకు తీసుకుపోయిన అటువంటి వ్యక్తి ఆయన అని అన్నారు.

దీన్ దయాళ్ జీవితాన్ని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని వారి ఇచ్చినట్టు స్ఫూర్తితోనే ముందుకెళ్లి దేశం కోసం పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణాధ్యక్షులు అయ్యన్నగారి రాజేందర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు జిల్లా కార్యదర్శి గాదె విలాస్ నాయకులు అనుముల శ్రావన్ కొండోజు శ్రావణ్ అల్లం భాస్కర్ కోటగిరి గోపి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పారిశ్రామిక కారిడార్ ల పనులు తక్షణమే చేపట్టండి

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment