బిచ్కుంద మండల కేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా బియ్యం పప్పు కూరగాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ కారణంగానే సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రచ శివకాంత్ డాక్టర్ నర్సింలు పోలీస్ సిబ్బంది సూర్యకాంత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.