ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో హుజూర్ నగర్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి గజగంటి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న జనాభాకు అనుగుణంగా ఆహార కల్పన కష్టతరం అవుతున్నదని,దేశంలో 40 కోట్ల మంది ప్రజలకు పౌష్టిక ఆహారం దొరకడం కష్టంగా ఉందని, ‘ఆపదలో సమయంలో కుటుంబ నియంత్రణ సంసిద్ధత సమర్థవంతమైన దేశం,కుటుంబాల సంపూర్ణ బాధ్యత’ నినాదంతో ముందుకు సాగాలని అన్నారు. జనాభా విషయంలో సామాజిక అవగాహన చాలా అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమములో వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, విజయశ్రీ,ఝాన్సీ, హైమావతి,మాధవి,లలిత, వరలక్ష్మి, అలివేలుమంగ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.