ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ అధ్యక్షులు లింగాల కమలరాజ్ అధ్యక్షతన జరిగిన మధిర నియోజకవర్గ స్థాయి సంస్థాగత సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.
నియోజకవర్గంలో వివిధ కమిటీల ను ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకలు నరేష్ రెడ్డి కి అందజేశారు.
ఎన్నికైన నూతన కమిటీలకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గ్రామాల నాయకులు, వివిధ వార్డుల నాయకులు పాల్గొన్నారు.