38.2 C
Hyderabad
April 28, 2024 19: 30 PM
Slider ముఖ్యంశాలు

డిమాండ్ ఫర్ జస్టిస్: అమిత్ షా రాజీనామా చేయాలి

shibli statement

దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన హింసాకాండకు బాధ్యులైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని హింసాకాండ పై ఎందుకు పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

బాధ్యులు పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. రక్షించండి అంటూ పోలీసులకు ఫోన్లు చేసినా ఎందుకని స్పందించలేదని ఇది పోలీసు వైఫల్యమని ఆయన అన్నారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కనుసైగ లో నడుస్తున్నందని, ఈ అమానవీయ హింసాకాండకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు.

2002 గుజరాత్ అల్లర్ల మాదిరిగానే ఢిల్లీలో అల్లర్లు సృష్టించారని ఆయన అన్నారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , హోమ్ మినిస్టర్ లు ఇప్పటి దేశ ప్రధాని, కేంద్ర హోం మినిస్టర్ లు గా ఉన్నారని ఆయన అన్నారు. వారు రాజీనామా చేయకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బృందాలను ఏర్పాటు చేశారని ఈ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బృందాల అధిపతులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి భక్తులు అన్న సంగతి అందరికి తెలుసునని వారి పరిశోధనలో ఏమీ తేలదని షిబ్లీ అన్నారు.

ఆదివారం మొదలైన అల్లర్లు సుమారు 72 గంటలు కొనసాగాయి. ఈ 72 గంటల్లో సుమారు 18వేల ఫోన్ కాల్స్ పోలీస్ స్టేషన్లకు నమోదు కావడం గమనార్హం అని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయాలతో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది బుల్లెట్ గాయాలు ఉండటం శోచనీయం అని షిబ్లీ పేర్కొన్నారు.

Related posts

అమెరికా – చైనా ఎత్తులు పైఎత్తులు

Satyam NEWS

నల్లకుంట డివిజన్ లో కొత్త రోడ్లకు శంకుస్థాపన

Satyam NEWS

సీఎం కేసీఆర్ కు బ్రాహ్మణ ఐక్యవేదిక కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment