నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది వరకూ మరణించడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.