అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమిష్టి సహాకారంతోనే గ్రామాల అభివృద్ది సాద్యమవుతుందని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.
సోమవారం జిల్లా లో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ మండలమైన వెంకటాపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు.
మొదట వెంకటాపురం మండలంలోని ఎదిర గ్రామ పంచాయితి పరిధిలోని పిహెచ్ సిని ఆయన తనిఖీ చేశారు.
ఈ పిహెచ్ సి నుండి ఉత్తమమైన సేవలను ప్రజలకు అందిస్తున్నారని జిల్లా ఈ పిహెచ్ సికి మంచి పేరు ఉందని ఆయన అన్నారు.
పిహెచ్ సిలోని పెషెంట్ వార్డును ఆయన పరిశీలించారు, అనంతరం ఆసుపత్రిలోని సిబ్బంది విషయమై ఆసుపత్రిలో కావాల్సిన ఇతర అవసరాల గురించి ఆయనకు ఒక నివేదిక సమర్పించాలని, ఆసుపత్రి అభివృద్దికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.
సిబ్బంది కొరత విషయంలో దిగులు చెందాల్సింది ఏమి లేదని తనకు సిబ్బంది గురించి తన దృష్టికి తీసుకవస్తే డిఎంఎఫ్ టి నిధుల నుండి కలెక్టర్ తో మాట్లాడి సిబ్బందిని నియామకం చేస్తానని ఆయన అన్నారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలోని పరిసరాలను పరిశీలించిన ఆయన పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తాను మళ్లీ పర్యటనకు వచ్చేటప్పటికి ఆసుపత్రి పరిసరాలలో ఏలాంటి చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్ కారం కన్నయ్యకు సూచించారు.
అదే విధంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన హెర్బల్ ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ఎదిర గ్రామ పంచాయితి పరిధిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన అక్కడి నుండి సూరవీడు గ్రామ పంచాయితి పరిధిలో సర్పంచ్ కుంజ గంగా ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికారు.
మొదట చైర్మన్ తో శాలువా కప్పి సన్మానించిన అనంతరం గ్రామ పంచాయితి ఆవరణలో మొక్క నాటి హరితహారం కార్యక్రమం నిర్వహించి ఇక నుండి పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించి గ్రామ పంచాయితి పరిధిలో గ్రామస్థులతో పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా అందిస్తున్న మొక్కల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిన్న పిల్లలతో కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలుబాక రైతు వేదిక ఆవరణలో , చొక్కాల గ్రామ పంచాయితి పరిధిలో సర్పంచ్ పూనెం శ్రీదేవి తో హరితహారం కార్యక్రమం నిర్వహించారు.