భద్రాద్రి శ్రీరామ చంద్రుడికి మహాపట్టాభిషేకం వేడుకను శాస్త్రోక్తంగా నేడు నిర్వహించారు. నిత్యకల్యాణ మండపం వద్ద ఈ క్రతువును వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పూర్తి చేశారు చేశారు.
కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు.
ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 27 వరకు నిత్యకల్యాణాలు నిలిపేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలను కూడా ఆపేశారు.