రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే అంశంపై ఆందోళనలు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న నినాదంతో రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఆందోళనలు నిర్వహించాలని వివిధ ప్రజా సంఘాలు నిర్ణయించాయి.
ధర్నాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్, లయోలా కళాశాల వాకర్స్ అసోసియేషన్, సిద్ధార్థ కళాశాల వాకర్స్ అసోసియేషన్తోపాటు ఐఎంఏ, ఇతర ప్రజాసంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపటి నుంచి ఆందోళనలు చేపట్టనున్నాయి.