రాజంపేట పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిస్కారమే నా ద్యేయంగా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పేర్కొన్నారు. జయంతి ఎక్సప్రెస్ రైలుని అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిలుపుదల అనుమతులు తీసుకువచ్చినందుకు గాను అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ ఆధ్వర్యంలో నందలూరులో జరిగిన అభినందన సభలో ABAP జాతీయ ప్రధాన కార్యదర్శి ఏనుగుల బాలాంజనేయులు సాయి లోకేష్ ని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ఏనుగుల బాలాంజనేయులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాజంపేట నందలూరు ప్రాంతాలలోని అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న విషయాన్ని సాయి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సమస్య విన్న సాయి లోకేష్ నేడు రాజంపేటలో జయంతి ఎక్సప్రెస్ నిలుపుదల అనుమతులను తీసుకువచ్చారని , రాబోవు రోజులలో నందలూరులో జయంతి ఎక్సప్రెస్ నిలుపుదల అయ్యేలా ప్రయత్నం చేయాలనీ కోరారు. ఈ సందర్బంగా సాయి లోకేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భవిష్యత్తులో మరి కొన్ని రైళ్లకు రాజంపేట, నందలూరు స్టేషన్లలో నిలిచేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర BJP మైనారిటీ నాయకుడు షబ్బీర్ అహమ్మెద్ , ABAP జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట శివశంకర్, మండల అధ్యక్షుడు ముమ్మడిశెట్టి సుధాకర్, అయ్యప్ప గురుస్వాములు మేడ వెంకట కుమార్, మురళి, బోయ మోహన్, కొమ్మ రవీంద్రారెడ్డి , గుండు గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ బాబు, కల్లూరు సుబ్బారాయుడు, వేణు, ముంగి సుబ్బారాయుడు, శివశంకర్, బోయ రాము, తదితరులు.