అంబర్ పేట్ డివిజన్ లోని పటేల్ నగర్ లో మంచినీటి సరఫరాలో లో-ప్రెషర్ వస్తుండడంతో స్థానిక బస్తి ప్రజలు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్ కి తెలిపారు. వెంటనే స్పందించిన కార్పోరేటర్ పటేల్ నగర్ లో పర్యటించి, స్థానికులతో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే సమస్యను పరిష్కరించ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తి ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, మోసిన్, హైమద్, వేణు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట