అత్తా కోడళ్ళ మధ్య ఫోను వివాదం నవ వధువు ఆత్మహత్యకు దారితీసిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ లోని భరత్ నగర్ లో ఉంటున్న శిల్ప (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. సికింద్రాబాద్ లోని అడిక్మెట్ కు చెందిన అమ్మాయి శిల్ప కు పవన్ తో పెళ్ళయి మూడు నెలలవుతోంది. ప్రస్తుతం శిల్ప ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు సమాచారం. ఇంటిలో శిల్ప ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అత్త మందలించడంతో ఇరువురి మధ్య వివాదం జరిగింది. దీంతో శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి ఎస్ ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post