42.2 C
Hyderabad
April 26, 2024 18: 58 PM
Slider హైదరాబాద్

ఫోన్ వివాదం-నవ వధువు ఆత్మహత్య

phone dispute-new bride commits suicide

అత్తా కోడళ్ళ మధ్య ఫోను వివాదం నవ వధువు ఆత్మహత్యకు దారితీసిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ లోని భరత్ నగర్ లో ఉంటున్న  శిల్ప (22)  అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. సికింద్రాబాద్ లోని అడిక్మెట్ కు చెందిన అమ్మాయి శిల్ప కు  పవన్ తో పెళ్ళయి మూడు నెలలవుతోంది. ప్రస్తుతం  శిల్ప ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు సమాచారం. ఇంటిలో శిల్ప ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అత్త మందలించడంతో ఇరువురి మధ్య వివాదం జరిగింది. దీంతో శిల్ప  ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి ఎస్ ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పార్టీలకు అతీతంగా ’సర్ధార్‌ సర్వాయిపాపన్న సేన’ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

Satyam NEWS

అమెరికాలో భారత కాన్సులేట్ కు నిప్పంటించిన ఖలిస్తానీలు

Satyam NEWS

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani

Leave a Comment