26.7 C
Hyderabad
April 27, 2024 10: 47 AM
Slider ప్రకాశం

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

#RTC bus

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు,ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విజయవాడకు చెందిన శ్రీను, అశోక్, సాయి,చంద్రశేఖర్ గా పోలీసులు గుర్తించారు.

తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 వాహనంలో వినుకొండలోని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుండి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అనంతపురం నుండి విజయవాడ వెళ్తున్న కారు త్రిపురాంతకం వద్ద ఎదురెదురుగా fci గోడౌన్

వద్ద ఢీకొన్నాయి.సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరొకరు మృతి చెందారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఉచితంగా నిత్యావసరాలు పంచిన విజయవాడ లయన్స్

Satyam NEWS

పసుపు మద్దతు ధరకు ఏకగ్రీవ తీర్మానం

Satyam NEWS

అమరావతిని కోర్టు మెట్లెక్కించిన ఘనత ముఖ్యమంత్రి దే

Bhavani

Leave a Comment