ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్, సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లపై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తులో ఉండగానే ఈ ఇద్దరు అధికారులు మీడియా ముందుకు వచ్చారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఇది వారి వారి ఉద్యోగరీత్యా చేయతగిన పని కాదని ఆయన అన్నారు. ప్రెస్ మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన తెలిపారు. ప్రజాధనం ఎంత వృథా అయిందో వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా వివరాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. కోర్టు అనుమతితో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని హైకోర్టు పిటిషనర్ ను కోరింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.