విజయనగరం జిల్లాకు వచ్చిన సమాచార హక్కుకమీషనర్ ఆర్.శ్రీనివాసరావు…జిల్లాకు వచ్చిన దగ్గర నుంచీ పలు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
తొలి రోజు జిల్లా అదికారులతో కలెక్టరేట్ లో సమావేశమైన కమీషనర్ శ్రీనివాసరావు రెండు రోజు ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈమేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలోనూ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హరిత విజయనగరంకోసం జిల్లాలో జరుగుతున్న కృషిని కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.గణపతిరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ,
ఆర్డీఓ బిహెచ్ భవానీశంకర్, డీఎఫ్ఓ ఎస్.జానకిరావు, హౌసింగ్ పీడీ ఎస్వి రమణమూర్తి, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, మున్సిపల్ ప్లాంటేషన్ అవనాపు రవి తదితరులు పాల్గొన్నారు.