బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ని పోటీకి ఉంచుతామని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రకటించారు. మార్టూరు పట్టణంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావుసుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొని నూతన నియామకాలు అందించారు.
తమపై నమ్మకం తో బాధ్యతలు ఇచ్చిన నవతరం పార్టీ అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా మార్టూరు పట్టణ అధికార ప్రతినిధిగా కొమెర అంకమ్మరావు,డేగరమూడి గ్రామ కార్యదర్శిగా బత్తుల దాసు, జొన్నతాళి గ్రామ అధ్యక్షుడు గా కొమెరగిరి దుర్గారావు,రాజుపాలెం గ్రామ కార్యదర్శిగా మేకల గంగయ్య, రాజుపాలెం గ్రామ అధికార ప్రతినిధిగా కట్టేంపూడి అశోక్ ను నియమించారు. నవతరంపార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల్లో నవతరంపార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో మార్టూరు మండలం అధ్యక్షుడు చెరుకూరి సుబ్బారావు,ఉపాధ్యక్షుడు మల్లెల శ్రీకాంత్, డేగరమూడి గ్రామ అధ్యక్షుడు ఆమటి పుల్లారావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షుడు జానపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.