లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మాధవ్ స్వామి
కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన రావి మాధవానందస్వామి (28) అర్చకులవద్ద అసిస్టెంట్ గా వెళ్తూ ఉంటాడు. ఇటీవల ఇతనికి డెంగ్యూ సోకింది. వ్యాధి తీవ్రమవడంతో ప్లేట్ లేట్స్ 20 వేలకు పడిపోయాయి. మరో వైపు లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాధవానందస్వామి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం కోసం 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. అయితే ఇతడి తల్లి దండ్రులు గుడి వద్ద దానాలు తీసుకుంటారు. వీరికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఈ పరిస్థితిలో వైద్యం కోసం 3 లక్షలు ఖర్చు చేసే స్థోమత తమకు లేదని మాధవానందస్వామి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. వైద్యం కోసం దాతలు స్పందించి సహాయం చేయాలని వేడుకుంటున్నారు..
ఆయన ఫోన్ పే..
RAVI MADHAVANANDA SWAMY
9866539243