ప్రతిభావంతులైన, పేద నీట్, ఐఐటీ-జేఈఈ ఔత్సహిక విద్యార్థుల శిక్షణ కై అవసరమైన సాయం అందించేందుకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్ స్థాపించినట్లు ఫౌండేషన్ చైర్మన్ కే. లలిత్ కుమార్ తెలిపారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గవెర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే గుర్తించ బడిన యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్ ద్వారా నీట్, ఐఐటీ-జేఈఈ సంబంధించి పలు సేవలు అందిస్తున్నామన్నారు.
విద్యారంగ లో 27 సంవత్సరాల అనుభవం తో గత 15 సంవత్సరాలు గా నిరంతరం గా నీట్, ఐఐటీ-జేఈఈ విద్యార్థుల అవగాహన కోసం ప్రవేశ పరీక్షలపై అవగాహన, వివిధ ప్రముఖ దిన పత్రికల్లో వ్యాసాలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖా ముఖి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అని లలిత్ కుమార్ తెలిపారు.
ప్రతిభ కలిగి ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల విద్యార్థుల చదువు మధ్య లో ఆగిపోకూడదు అనే లక్ష్యం తో పని చేస్తున్నామన్నారు.
ఫౌండేషన్ తో చేయి కలిపి, సాయం చేద్దాం అని ఆసక్తిగలవారు 90525 16661నెంబర్ పై, ఈ మెయిల్ :kanchanaafoundation@gmail.com ద్వారా సంప్రదించవచ్చని లలిత్ కుమార్ తెలిపారు.