42.2 C
Hyderabad
April 26, 2024 15: 16 PM
Slider నిజామాబాద్

పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దారులకు బియ్యం ఇవ్వాలి

kotagiri

లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే ఉచిత బియ్యం,నగదును కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని డీ ఎస్ ఓ లో పెండింగ్ ఉన్న  రేషన్ కార్డు దారులకు కూడా బియ్యం పంపిణీ చేయాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల బీజేపీ నాయకులు బుధవారం ఇంచార్జి తహసీల్దార్ విఠల్ కు వినతిపత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ కార్డులో పేరు నమోదు కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకొని సంవత్సరంకు పైగా అయ్యిందని అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ రేషన్ కార్డులు జిల్లా  డి.ఎస్.ఓ. కార్యాలయంలో పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు.

రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నవారంతా నిరుపేదలేనని ప్రస్తుతం కారోనా వైరస్ ప్రభావంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వారందరినీ అధికారులు దృష్టిలో పెట్టుకుని వెంటనే నూతన రేషన్ కార్డ్ నమోదు చేసుకున్న లబ్ధిదారులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత బియ్యాన్ని, నగదును అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, రమేష్, కాశీరం, సాయిలు, శ్రీనివాస్, నవీన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో వెల్లడిస్తా

Bhavani

ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

30న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కు “గురజాడ” పురస్కారం

Bhavani

Leave a Comment