30.7 C
Hyderabad
April 29, 2024 06: 03 AM
Slider ప్రత్యేకం

అత్తా కోడళ్ల చేనేత వస్త్రాల షాపింగ్ సందడి

bharati 2

ఇద్దరూ విఐపిలే. ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వై ఎస్ విజయమ్మ. రెండో వారు ఆయన సతీమణి వై ఎస్ భారతి. ఇద్దరూ కలిసి నేడు షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో  చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ చేనేత వస్త్ర ప్రదర్శనకు అత్తా కోడళ్లు ఇద్దరూ కలిసి వచ్చారు. సరదాగా అక్కడి వారి అందరితో కలిసి ఫొటోలు దిగారు. వస్త్ర ప్రదర్శనను వారు పూర్తిగా సందర్శించారు. అక్కడ వస్త్రాలు, ఆభరణాలను విజయమ్మ, భారతి కొనుగోలు చేశారు. వారికి అన్ని వెరైటీల చీరలు చూపించేందుకు అమ్మకందారులు పోటీపడ్డారు.

అందరితో కలిసి వారు సరదాగా ఫొటోలు కూడా తీయించుకోవడంతో పలు సందర్భాలలో నవ్వులు విరిశాయి. చేనేత ఉత్పత్తులకు విస్త్రత ప్రాచుర్యం కల్పించేందుకు అత్తా కోడళ్లు కలిసి రావడం అక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Related posts

కరోనా వాక్సిన్ విషయంలో మానవ కోణం అవసరం

Satyam NEWS

డాక్ట‌ర్ పీవీజీ రాజు జ‌యంతి సంద‌ర్బంగా మెగా మెడిక‌ల్ క్యాంప్…!

Satyam NEWS

సొల్యూషన్: హైదరాబాద్ నుంచి పని చేస్తున్న ఎన్నికల కమిషనర్

Satyam NEWS

Leave a Comment