పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ స్పీకర్..!
పోలీసులే మాకు రక్షణ కవచకులని వాళ్లు లేనిదే మేము బయటకు వెళ్లలేమని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీస్ బ్యారెక్స్ వద్దే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా జిల్లాలో అమరులైన అయిదుగురిని స్మరించారు. ఇక జేడ్పీ చైర్మన్ చిన్న శీను కూడా కార్యక్రమంకు హాజరై…నివాళులు అర్పించారు.
విశేషం ఏంటంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ఎవ్వరూ మాట్లాడలేదు. కేవలం ఏఎస్పీ అస్మా ఫర్హీన్ మాత్రమే… పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంతవరకు ఎంతమంది అమరులయ్యారో వారి పేర్లను మాత్రమే చదవడం విశేషం.అనంతరం ప్లటూన్ కమాండెంట్ నుంచీ గౌరవ వందనం స్వీకరించిన అధికారులు…. అక్కడే నిర్మితమైన అమరవీరుల స్థూపం వద్ద కాళ్లకు వేసుకున్న చెప్పులు విడిచి మరీ అంజలి ఘటించారు…. డిప్యూటీ స్పీకర్, జేడ్పీ చైర్మన్, కలెక్టర్ లు.