38.2 C
Hyderabad
April 29, 2024 22: 14 PM
Slider ముఖ్యంశాలు

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

#ontimitta

ఒంటిమిట్ట లో  బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించి డి.ఎస్.పి లు, సి.ఐ లకు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ పలు సూచనలు  చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులను వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్దతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు.  బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు.  ఏ.ఆర్ అదనపు ఎస్.పి మహేష్ కుమార్, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి,  సి.ఐ లు రాజాప్రభాకర్, హనుమంతు నాయక్, ఆనంద రావు, సిబ్బంది ఉన్నారు.

Related posts

Analysis: మోడీ పర్యటనతో బంధం మరింత పటిష్టం

Satyam NEWS

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

Satyam NEWS

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Sub Editor

Leave a Comment