ఒంటిమిట్ట లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించి డి.ఎస్.పి లు, సి.ఐ లకు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులను వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్దతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఏ.ఆర్ అదనపు ఎస్.పి మహేష్ కుమార్, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, సి.ఐ లు రాజాప్రభాకర్, హనుమంతు నాయక్, ఆనంద రావు, సిబ్బంది ఉన్నారు.