సులువుగా డబ్బులు దొంగిలించే మార్గాలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా ఈజీ మనీని సంపాదించాలంటే…ఆన్ లైన్లో దొంగతనాలు చేసేందుకు నేరస్థులు అప్ డేట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా బీటెక్ చదివే స్టూడెంట్స్ ఈజీ మనీ కోసం.. ఆన్ లైన్ ఫ్రాడ్స్ కు దిగుతున్నారు. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు.. ఏపీలోని విజయనగరం జిల్లా పోలీసు శాఖ అంతర్జాతీయంగా జరుగుతున్న ఆన్ ఫ్రాడ్ కు సంబంధించి పోలీసు శాఖలో ఎస్ఐ ర్యాంక్ నుంచీ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ రాజకుమారీ అవగాహన సదస్సు నిర్వహించారు.
వాణిజ్య బ్యాంక్ హెడీఎఫ్సీ ద్వారా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని దండుమారమ్మ దేవాలయం వద్ద జరిగిన ఈ అవగాహన సదస్సులో పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. ఆ బ్యాంకు ప్రతినిధి.. ఎల్ సీడీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు జిల్లా ఎస్పీ రాజకుమారీ, అడిషనల్ ఎస్పీలు డీఎస్పీలు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు సంబంధిత స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు.