తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలవడంతో అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భరించలేకపోయారు. దాంతో వారు ఏం చేశారో తెలుసా?
పోలింగ్ అధికారులను నిర్బంధించారు. ఈ సంఘటన నంద్యాల ప్రాంతంలోని పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో జరిగింది.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోలింగ్ అధికారులను వెళ్లకుండా కట్టడి చేశారు.
రీకౌంటింగ్ జరపాలని అడ్డుపడ్డారు.
వైసీపీ అభ్యర్థి పై టిడిపి అభ్యర్థి గెలవడంతో రీకౌంటింగ్ జరపాలని వైసిపి నాయకులు అధికారులను అడ్డగించారు. పోలీసులు వారిని నిలువరించి పోలింగ్ సిబ్బందిని పంపించారు.