వనపర్తి జిల్లా ఘనపురం మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన తల్లి,పిల్లలను పోలీసులు కాపాడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
రజియా తన ముగ్గురు పిల్లలతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్న విషయం తెలుసుకున్న ఘనపురం ఎస్.ఐ. వెంకటేష్ గౌడ్,ట్రైనీ ఎస్.ఐ. శృతి,కానిస్టేబుల్ విజయ్,డ్రైవర్లు రాజు,శ్రావణ్ చెరువు దగ్గరకు చేరుకుని తల్లి,ముగ్గురు పిల్లలను కాపాడారు.
వివాహిత రజియబేగం తన పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని ఎస్.ఐ. వెంకటేష్ గౌడ్ విలేకరులకు తెలిపారు.
ఆత్మహత్య చేసుకోరాదని,కుటుంబ సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కు రావాలని ఆయన మహిళలను కోరారు. ఆత్మహత్య వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి