ఎన్నికలు సమీస్తుండటంతో ప్రస్తుతం పని చేస్తున్న సబ్ ఇన్ స్పెకర్టకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో పని చేస్తున్న 26 మంది సబ్ ఇన్ స్పెక్టర్లును బదిలీ చేస్తూ జిల్లా పోలీస్ బాస్ దీపికా ఎం పాటిల్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యంగా గత ఎస్పీ రాజకుమారీ హాయంలో పని చేసే…దాదాపు నలుగురు అయిదుగురు ఎస్ఐలను తిరిగి..విజయనగరం లో ఉన్న వన్,టౌన్,రూరల్,దిశ, పోలీస్ స్టేషన్లకు..తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అందులో రాజం ఎస్ఐ లీలావతి, గుర్ల ఎస్ఐ హరిబాబు,డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్,రూరల్ ఎస్ఐ నసీబాబేగం,నెల్లిమర్ల ఎస్ఐ నారాయణ ఇలా వీరందరూ…తిరిగి మళ్లీ విజయనగరం లోకి మళ్లీ రావడం విశేషం. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 మంది ఎస్ఐలు బదిలీ కావడం విశేషం. జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న 26మంది ఎస్ఐలను పరిపాలన సౌలభ్యం కోసం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఉత్తర్వులు జారీ చేశారు.