ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతానికై రేపటి నుంచి 2 రోజుల పాటు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్ పర్యటించనున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభ విజయవంతం చేయడానికై నియోజకవర్గంలో భాజాపా శ్రేణులను సంసిద్ధం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తారు.
అదే విధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్&హైవే శాఖ మంత్రి, పూర్వ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు పొన్ను రాధాకృష్ణన్ పర్యటనను అందరూ విజయవంతం చేయాలని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు కోరారు.