రంజాన్ పర్వదినం పురస్కరించుకొని తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కేపీహెచ్ బీ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్కే సత్తా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, శాలువా తో సత్కరించారు. పార్టీ అభివృద్ధి కోసం మీరంతా పని చేయండి, మీ వెంట నేనున్నానంటూ భుజం తట్టి బాబు భరోసా ఇచ్చినట్లు సత్తార్ తెలిపారు.
ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ రంజాన్ పర్వదినం కుటుంబ సభ్యులతో కలసి మెలసి జరుపుకోవాలని మీకు ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అని సందర్భంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, షాహుల్ తదితరులు పాల్గొన్నారు.