పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. బొడిగ బాలయ్య 7వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పెద్ద చర్లపల్లి బస్టాండ్లో సొలిస్ కంటి ఆస్పత్రి, ఈసీ నగర్ లైన్స్ ఆస్పత్రుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. బొడిగె బాలయ్య ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను హర్షిస్తూ ట్రస్టు నిర్వాహకులు బొడిగ రవి, రాజు గౌడ్ లను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్, నాయకులు కడియాల పోచయ్య, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు నాయకులు ఎంపల్లి పద్మా రెడ్డి, ఈసీ నగర్ సత్తిరెడ్డి, కడియాల రమేష్ బాబు, కడియాల బాబు, కె వి ఎల్ ఎన్ రావు, దూడల సాంబమూర్తి గౌడ్, బుడగ జంగాల రాష్ట్ర చైర్మన్ తూర్పాటి హనుమంతు, కర్రె సత్యనారాయణ, రెడ్డి నాయక్, సర్ఫరాజ్, రాకేష్, యూసుఫ్, తూర్పాటి వెంకటస్వామి, సోమయ్య, నాలుగు కాళ్ళ వెంకటేష్, మంద చంద్రమౌళి, రాధాకృష్ణ, శంకర్, బాల్రాజ్, జంగిడి కిష్టమ్మ, మందుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి