సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగగిరి గ్రామం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవాలయానికి సంబంధించిన భూములపై కౌలు అంశాలను ఖరారు చేశారు. లింగగిరి గ్రామంలోని వ్యవసాయ భూమి నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలకు సంబంధించిన కౌలు వేలం నిర్వహించారు.
ఈ కౌలు వేలంపాటలో గుంజా కృష్ణ అనే రైతు 60 వేల రూపాయలకు ఈ వ్యవసాయ భూమిని బహిరంగ వేలం ద్వారా కౌలు చేసేందుకు అనుమతి పొందారు. తదుపరి అదే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన వ్యవసాయ భూముల కౌలు గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో సానుకూలమైన నిర్ణయం జరగక పోవటం వలన వాయిదా వేశారు.
ఈ కౌలు వేలంపాట కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, మిర్యాలగూడ పరిశీలన అధికారి రమేష్, ఈవో గుజ్జుల కొండారెడ్డి, శంబి రెడ్డి, గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపిటిసి జయమ్మ, దేవాలయ అర్చకులు దామోదరాచార్యులు గ్రామంలోని పెద్దలు, రైతులు పాల్గొన్నారు.