అసలే ఎండాకాలం… ఆ పై ఉక్క పోత… వీటన్నింటికి తోడు అనారోగ్యం… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలు ముదిరిపోయిన ఈ రోజుల్లో కరెంటు కోతలు జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో ఈ హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలే ఎండాకాలం కావడంతో కరెంటు కూడా లేకపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతం. కరెంటు కోతలతో సాధారణ ప్రజలే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక రోగుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు కనీవిని ఎరుగని స్థాయికి చేరుకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.