40.2 C
Hyderabad
May 2, 2024 16: 34 PM
Slider తూర్పుగోదావరి

కరెంటు కోతతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నరకయాతన

#kakinada

అసలే ఎండాకాలం… ఆ పై ఉక్క పోత… వీటన్నింటికి తోడు అనారోగ్యం… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలు ముదిరిపోయిన ఈ రోజుల్లో కరెంటు కోతలు జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో ఈ హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలే ఎండాకాలం కావడంతో కరెంటు కూడా లేకపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతం. కరెంటు కోతలతో సాధారణ ప్రజలే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక రోగుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు కనీవిని ఎరుగని స్థాయికి చేరుకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Related posts

సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

Satyam NEWS

రంజాన్ తోఫా అందచేసిన గోల్నాక డివిజన్ కార్పొరేటర్

Satyam NEWS

టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment