తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులను చూసి ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు మళ్లీ పిడుగులాంటి వార్త వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావు పల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తల ఇద్దరి రక్త నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు శనివారం హైదరాబాద్ పంపించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
హైదరాబాద్ నుండి సొంత గ్రామం అంకిరావు పల్లికి కు పది రోజుల క్రిందట వచ్చారని వారికి జ్వరం దగ్గు ఉండడంతో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను వారికి అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే దగ్గు జ్వరం కొనసాగడంతో కరోనా అనుమానితులుగా భావించి వారి నుంచి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.