నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె మనోహర్ ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులను పంపుతూ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. భార్య భర్తల మధ్య గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు, డబ్బు విషయంలో గొడవలు, భూ సంబంధిత గొడవలు, ఇరువురి మద్య గొడవలు లాంటి ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో వచ్చిన 4 ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
next post