భారీ వర్షాల నేపథ్యంలో రేపటి ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా నీటి పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని, స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థుతుల కారణంగా అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉండాలని, క్షేత్ర పర్యటనలోని సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలల్లో సహాయక చర్యలు నిర్వహించాలని అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. సెలవుల్లో ఉన్న అధికారుల, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థుల్లో ఉన్న వారికి, కలెక్టర్ అనుమతి పొంది సెలవుపై వెళ్లాలని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పంచాయతీ, మునిసిపల్ అధికారులను ఆదేశించారు.