నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 7 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ కె మనోహర్ స్వయంగా మాట్లాడారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. పాత కేసు విచారణ గురించి ఒకరు, భూ సంబంధిత గొడవలకు సంబంధించి ఇద్దరు, ఇద్దరి మధ్య ఘర్షణలకు సంబంధించిన ఫిర్యాదులు నాలుగు అందాయి.
previous post
next post