సమాజ హితం కోరి విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్,జీవన గమనం పత్రికా సంపాదకులు శ్రీకాకుళం మురపాక సన్యాసిరావును ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ ఘనంగా సత్కరించారు. బుధవారం శ్రీకాకుళం పాత్రికేయులు ప్రెస్ అకాడమీకి విచ్చేసిన సందర్భగా ఈమేరకు సన్యాసిరావును శాలువాతో సన్మానించి ప్రెస్ ఆకాడమి బుక్స్ బహుకరించారు.ప్రజాహితం కోరి పరులకు సహకరిస్తూ… వారు అనుసరిస్తున్న ధర్మ ప్రచార తీరును ప్రశంసించారు. ప్రెస్ అకాడమి పాత్రికేయుల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాల పట్ల అభినందనలు తెలుపుతూ సన్మాన గ్రహిత సన్యాసిరావు ప్రెస్ అకాడమి సెక్రెటరీ తిలిక్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో “పెన్ ” నాయకులు బడే ప్రభాకర్, శ్రీకాకుళం పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు
previous post
next post