తెలంగాణ రాష్ట్ర పీ సీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించే జంగ్ సైరన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ పత్తి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి లు మాట్లాడుతూ శాంతి యుతంగా వెళ్తున్న నాయకులను అక్రమంగా అరెస్టులు చెయ్యడం పిరికిపంద చర్య అని అన్నారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి, సందీప్ గౌడ్ తదితరులు ముందస్తు అరెస్టయిన వారిలో ఉన్నారు.