ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి ఆయన డ్రీమ్ బాయ్. అయితే మహేష్ బాబుకు ఒక డ్రీమ్ బాయ్ ఉన్నారు. ఆయనే ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్. సర్కారు వారి పాట థియేట్రికల్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ యూరప్, అమెరికా ట్రిప్ కు వెళ్లారు. మహేష్ 28వ చిత్రం 2023లో విడుదల కానుంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
అసలు విషయానికి వస్తే మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఈరోజు బిల్ గేట్స్ను కలిశారు. సూపర్ స్టార్, బిల్ గేట్స్కి వీరాభిమాని. బిలియనీర్- ఇతరులకు ఎంతో సహాయం చేసే బిల్స్ గేట్స్ ను కలిసిన తర్వాత ఆయన చేసిన ట్వీట్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిని ఎంతగానో ఆరాధిస్తున్నట్లు చెబుతుంది. ఆ ట్వీట్ను మహేష్ కూడా పిన్ చేశాడు.”మిస్టర్ బిల్ గేట్స్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు… ఇంకా అత్యంత వినయం! నిజంగా స్ఫూర్తి!!” అని ట్వీట్ చేశాడు.