29.7 C
Hyderabad
May 2, 2024 06: 41 AM
Slider రంగారెడ్డి

‌ప్రైవేట్ టీచ‌ర్లకు భ‌రోసా కోస‌మే ధీక్ష‌

private Teachers

ప్రైవేట్ టీచర్స్ ఫోరం వికారాబాద్ జిల్లా కమిటీ, తాండూరు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మహా సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని ది సీడ్స్ అండ్ గ్రీన్ మర్చంట్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించారు.

ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ బిసి సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 25మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రైవేట్ టీచర్లకు భరోసా కల్పించడానికి దీక్ష చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రైవేటు విద్యా రంగంలో ఉన్నటువంటి 5 లక్షల మంది బోధన, భోదనేతర సిబ్బందిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అఖిల్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమ శేఖర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, అసిఫ్, సీపీఐ నాయకులు విజయలక్ష్మి పండిట్, సిపిఎం నాయకులు శ్రీనివాస్, రమేష్, విద్యావంతుల వేదిక పర్యాద రామకృష్ణ ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్, షూకూర్, వెంకట్త దితరులు పాల్గొన్నారు.

Related posts

మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

Murali Krishna

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS

Leave a Comment